Saturday, 17 December 2016

సమష్టిగా లక్ష్యం చేరుకుందాం పేటను నగదు రహితంగా మారుద్దాం సీఎం కేసీఆర్‌ రూ.5 కోట్లు కేటాయించారు అధికారులు, బ్యాంకర్ల సమావేశంలో మంత్రి హరీశ్‌రావు

సమష్టిగా లక్ష్యం చేరుకుందాం 
పేటను నగదు రహితంగా మారుద్దాం 
సీఎం కేసీఆర్‌ రూ.5 కోట్లు కేటాయించారు 
అధికారులు, బ్యాంకర్ల సమావేశంలో మంత్రి హరీశ్‌రావు

న్యూస్‌టుడే-సిద్దిపేట: సిద్దిపేట నియోజకవర్గంలో నమూనాగా చేపట్టిన నగదు రహిత లావాదేవీల ఉద్యమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు బ్యాంకర్లు, అధికారులకు సూచించారు. సిద్దిపేట శివారులోని బైరి అంజయ్య గార్డెన్‌లో నగదురహిత లావాదేవీల అమలు ఎంత మేర వచ్చింది..? ఏం సమస్యలున్నాయి...వాటిని అధిగమించడం ఎలా..? అనే అంశంపై శుక్రవారం బ్యాంకింగ్‌ అధికారులు, వివిధ శాఖల రాష్ట్రస్థాయి అధికారులతో ప్రత్యేక సమావేశం జరిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉద్యమ స్ఫూర్తితో చేపట్టిన ఈ క్రతువులో ఎక్కడ లోపం తలెత్తినా లక్ష్యానికి ఆటంకం కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ రూ.5 కోట్లు నియోజకవర్గానికి కేటాయించారన్నారు. కొత్త ఖాతాలు తెరవడంతో పాటు కార్డులు లేనివారికి వెంటనే అందించాలని.. ఇక వ్యాపారులు, సంస్థలకు డిమాండ్‌కు అనుగుణంగా స్వైపింగ్‌ యంత్రాలు జారీ చేయాలని బ్యాంకర్లను ఆదేశించారు.అదనపు సిబ్బందిని వెంటనే నియమించాలన్నారు. ఎస్‌బీహెచ్‌, ఎస్‌బీఐలు ఇన్‌ఆపరేటీవ్‌ ఖాతాలను వారంరోజుల్లో యాక్టివేట్‌ చేసి రూపే కార్డులు జారీ చేయనున్నారని వివరించారు.మిగతా బ్యాంకులు ఇదే తరహాలో చర్యలు తీసుకోవాలన్నారు. ఈ-లావాదేవీల పర్యవేక్షణకు ప్రతి బ్యాంకు ఒక సీనియర్‌ అధికారిని కేటాయించాలి. ప్రతివారం ప్రగతి తీరు సమీక్షించాలన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం అదనపు కార్యదర్శి స్మితసబర్వాల్‌ మాట్లాడుతూ నగదురహిత ఉద్యమంలో అంతా బాగా పనిచేస్తున్నారు. జిల్లా కలెక్టర్‌ ప్రత్యేకంగా చొరవచూపుతున్నారని అభినందించారు. ప్రజలు, వ్యాపారుల్లో అవగాహన కల్గించాలన్నారు. కలెక్టర్‌ వెంకటరామరెడ్డి మాట్లాడుతూ...నియోజకవర్గంలోని 75 గ్రామపంచాయతీలు, 34 వార్డులను నగదురహితం చేసేందుకు చేపట్టిన ప్రక్రియ చురుగ్గా సాగుతోందన్నారు. ఈపాటికే 26 వేల మందికి అవగాహన కల్పించాం. 70-80 వేల ఖాతాలు ప్రారంభం అయ్యాయన్నారు. తెలంగాణ రాష్ట్ర సహకార బ్యాంకు అధ్యక్షుడు కె.రవీందర్‌రావు మాట్లాడుతూ...సహకార బ్యాంకులు, సంఘాల్లో ఖాతాలు, రూపేకార్డులు వేగంగా జారీ చేస్తున్నామన్నారు. రాష్ట్ర మున్సిపల్‌ పరిపాలన, పట్టణాభివృద్ధిశాఖ కార్యదర్శి నవీన్‌మిత్తల్‌ ప్రసంగిస్తూ సిద్దిపేట దేశానికి ఆదర్శం కాబోతుందనీ, బ్యాంకర్లు సంపూర్ణ సహకారం అందించాలన్నారు.మెప్మా ద్వారా ఈ-లావాదేవీలు ప్రోత్సహిస్తామన్నారు. రాష్ట్ర ఆర్థికశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా మాట్లాడుతూ...నగదురహిత ఆవశ్యకతను బ్యాంకర్లు గుర్తించి సహకరించాలన్నారు.పౌరసరఫరాలశాఖ కమిషనర్‌ సీవీ ఆనంద్‌, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్‌ నదీంఅహ్మద్‌, ఆంధ్రా బ్యాంకు సీజీఎం సత్యనారాయణ మూర్తి, ఎస్‌బీఐ జనరల్‌ మేనేజర్‌ గిరిధర్‌, ఎస్‌బీహెచ్‌ జీఎంలు రాజీవ్‌శర్మ, త్యాగరాజన్‌, వాణిజ్య పన్నులశాఖ అదనపు కమిషనర్‌ రేవతి రోహిణి, సీపీ శివకుమార్‌, జేసీ హనుమంతరావు, డీసీసీబీ ఛైర్మన్‌ దేవేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సమష్టిగా లక్ష్యం చేరుకుందాం పేటను నగదు రహితంగా మారుద్దాం సీఎం కేసీఆర్‌ రూ.5 కోట్లు కేటాయించారు అధికారులు, బ్యాంకర్ల సమావేశంలో మంత్రి హరీశ్‌రావు
4/ 5
Oleh